దురాశా పిశాచం

దురాశా పిశాచం
జగన్నాధపురం జమీ ధనవర్మ ఏలు బడి లోకిరాగానే ,ఆయన అనేకమార్పులు చేసాడు.దానికికారణం తాను అందరికంటే గొప్ప ధనవం తుడు కావాలని ఆశ. తన ఏకాం తమందిరం నిండా ధనరాసులు నిండిపోయి ఉన్నట్లూ ,ఆధనరాసులకాంతులమధ్య తాను ఉన్నట్లూ ప్రతిరోజూ కలలు కనేవాడు.ఆకలలు నిజంచేసుకోను ధనవర్మ పరిపాలనలో కొన్నిమర్పులుచేశాడు. తరతరాలుగా తన జమీలో జరుగుతున్న నిత్య అన్నదానపధకాలు, దేవాలయాలలోని ప్రత్యేకపూజలూ , తిరినాళ్ళూ , ఉత్సవాలూ రద్దుచేశాడు. దాంతో కొంతఖర్చు తగ్గినట్లు భావించాడు.ప్రజలపై పన్నులు రెట్టింపు చేశాడు. తండ్రి , దివాను , పెద్దలూ ఎంతచెప్పినా వినలేదు. పోగైన ఆధనం రాసులుగాపోసు కున్నాడు.ప్రజలు పెం చినపన్నులు కట్టలేక నా నా బాధలూ ప డసాగారు.రాత్రి పూటపురవీధుల్లో పది గంటలతర్వాత వీధి దీఅపాలన్నీ ఆర్పేయమని ఆఙ్ఞ్ వేశాడు.తన జమీ లోని ముసలిపని వారినంతా తీసేసి సగం మందినే యువకుల్ని నియమించి రెట్టింపుపనిచే యించసా గా డు. మందిరంలో హుందాగా అందంగా వెలిగే దీపాలు దుబారాగా భావించి తగ్గించేశాడు.వంటలూ పూలఖర్చుల్లోను కోతవిధించాడు.
ఈవిధంగాపొదుపు చేసినధనాన్ని కూడారాసులు పొసుకున్నా ఇంకా ఆ రాసుల్ని ఎలా పెంచుకోవాలా అనేతపనతో అశాంతి , అసహనం, కోపం ,నిద్రలేమి పెరిగిపోయాయి.తల్లి తండ్రులతో, భర్యా బిడ్డలతో మాట్లాడ టమే మానేశాడు. ప్రజలందరూ ముసలిజమీం దారైన జగన్నాధవర్మ కు తమ కష్టా లు మొరపెట్టు కున్నారు . జగన్నాధవర్మ ప్రజల బాధలు విని భరించలేక , భార్యతోకల్సి కొంతకాలం పుణ్య తీర్ధాలు సేవించను బయల్దేరివెళ్లాడు. పుణ్య క్షేత్ర దర్శ నాలు చేస్తూ జగన్నాధ వర్మ దంపతులు , దేవతలందర్నీ తమకుమరునికి పట్టిన దురాశాపిశాచాన్ని వదిలించి , అతనిలోమంచిమార్పు తెమ్మని ప్రార్ధించ సాగారు. ఒక అటవీప్రాంతంలోని పురాతనదేవాలయ మంటపంలో విశ్రాంతి తీసుకుం టున్న వారిని ఓ సాధువు పలుకరించాడు.వారుభక్తి తో ఆ యనకు నమస్క రించారు. వారి విచార ము ఖ కవళికలు గమనించిన ఆ సాధువు , వారి ద్వారా విషయం అంతా తెల్సుకుని , వారికి ఓ వుపాయం చెప్పాడు.జగన్నాధ వర్మ సం తోషం తో , భార్య తో కల్సి నగరానికి తిరిగి వచ్చాడు. తర్వాత మూడు రోజులకు ఒక సాధువు నగరానికి వచ్చాడు.ఆ యన అడిగిన వారి కోరికలన్నీ తీర్చుతున్నా డనే ప్రచారం సాగింది.నగర ప్రజలంతా ఆ యనను దర్సిం చను గుంపులుగా రాసాగారు.

దురాశా పరుడైన ధనవర్మ ఆ సాధువును దర్సించి , తన చిరకాలపు కలలు నిజంచేయమని ప్రార్ధించాడు. తన ఏ కాంత మందిరానికి ఆ యన్ను ఆ హ్వా నించాడు.సాధువు ధనవర్మ మందిరం ప్రవేసించి ,కళ్ళుమూసుకుని ఒక మంత్రం పఠించాడు.ఏ డు పెద్ద బానలు సృ ష్టించాడు. ఆ ఏ డు బానల్లోసగానికి వజ్రాలూ, ముత్యాలూ, బంగారు ఆ భరణాలూ,కాసులూ న్నాయి.” ధనవర్మా ! నీవద్ద వున్నధనాన్ని ఈ బానల్లో నింపు .నీస్వంత ధనంతో వీటిని నింపితే నీకలలు ఫలిస్తాయి.” అని చెప్పి ఆ సాధువు వెళ్ళి పోయాడు. ధనవర్మ తన ఏ కాంతమం దిరంలో తాను రాసులుపోసుకున్న ధనాన్ని ఆ బానలనిండా నింపసాగాడు.సగంవరకూ నిండివున్న ఆ ఏ డు బానల్లో ఆ రుమాత్రం పుర్తిగా నిండాయి.ఏ డవ బాన మాత్రం నిండలేదు.ఆ రోజు నుండీ ధనవర్మ ,ఇంకా పొదుపు పా టించి ,ఇంకా పన్నులు పెంచి ధనం కూ డబెట్టి, ఆ ఏడ వబాన నింపే ప్రయత్నం ముమ్మరం చేశాడు.
ఎం త పొసినా అదినిం డటంలేదు.రాజబాటల్లో హుండీలు పెట్టి ఆ దారినపోయే వారిపై దారిసుంకం ” కుడా విధించాడు.తల్లి తండ్రులు భార్య అతని దురాశను ఆ పను ఎం త ప్రయత్నించినా , వారిమాటలు పెడ చెవిని పెట్టాడు.రాత్రి పూట మారు వేషంలో ,జోలెపట్టిధనం సేకరించసాగాడు.

.ప్రజలు అతన్ని గుర్తించినా, అసహ్యంతో , నవ్వుకుంటూను, గుర్తించనట్లే ఎం తో కొంత డబ్బు వేయసాగారు.ఎం తధనం పోసినా ఆ ఏ డవ బాన నిండటంలేదు.అ న్నపానాదులుమాని ధనసేకరణలో పడి చిక్కి పోసాగాడు ధనవర్మ.దురాశా పిశాచం పట్టి పీడించేవాడు అల్లాగే అవుతాడు మరి

ఎ లాగైనా ఆ ఏ డవ బానను నింపాలనే పట్టుదలపెరగ సాగింది. పక్క నగరాలకు రాత్రిపూట మారు వేషం లో వెళ్ళి జోలెపట్టిధనంపోగుచేయసాగాడు నగరవాసులు అతన్ని ఇం తబలంగా వున్నా వే అ డుక్కొకపోతే ఏ దైనా కా య కష్టం చేసి నాల్గు డబ్బులు సం పాదించుకోరాదా? అడుక్కోను నీకు సిగ్గుగాలేదా?” , అని ఛీ కొట్టసాగారు. ఆ మాటలతో ధనవర్మ పంతం పెరిగింది.మారువేషంలోనే పక్కగ్రామాలకు వెళ్ళి కొలిమివద్ద కమ్మరిపని, కట్టెలు కొట్టేపని, రాళ్ళుమొసేపనీ, సేస్తూ కొంత ధనం పొగుచేశాడు.అ లాసంపాదించినధనాన్ని తెచ్చి, ఆ ఏ డవబానలో పొయగానే అ దినిం డిపొర్లింది.
ధనవర్మ ఆ శ్చర్యంతో ఇం తకాలం ఎంతపోసినా నిండని బాన ,తానుకూలిచేసి పోగుచేసిన కొద్దిపాటిధనంతోఎ లానిండిందాని అనుకుని ,ఆ సాధువు కనిపిస్తేఅడగాలని తలంచిన వెంటనే, ఆ సాధువు ధనవర్మ ఎ దుట ప్రత్యక్షమయ్యాడు.

“ధనవర్మా! నీ స్వంత ధనంతో ఆ ఏడు బానలూ నింపమన్నాను,నీవు నీ తాతలనాటి ధనాన్నీ ప్రజలపై అ న్యాయంగా పన్నులువేసి వసూలు చేసిన ధనాన్నీ ,సిగ్గు విడచి జోలెపట్టి సంపాదించిన ధనాన్నీ ఆ బానల్లో పోశావు. ఎం తకష్ట పడితే ధనం సంపాదించగలమో తెల్సు కోలేక పో యావు. ధనంకూడబెడితే అది పిశాచంలా పీడిస్తుంది. శాంతిలేకుండాచేస్తుంది.ఊ రకేవున్నధనం ఎవ్వరికీ వుపయోగపడని ధనంచూసుకుని సంతోషించే బదులు ఇసుక, రాళ్ళు ,మట్టీ ,ధనంగానే భావించి చూసుకుని సంతోషించవచ్చు.దానికోసం ప్రజలనూ కన్న తల్లి తండ్రులను భార్యాబిడ్దలనూ ఇన్ని కష్టా ల పాలు చేయవలసిన పనిలేదు.తాతముత్తా తలు ప్రజా సంక్షేమం కోసం ,దేవాలయాల్లో పూజలకోసం, అన్న దానాలకోసం ప్రత్యేకించి న ధనాన్ని ,వాటినంతా ఆ పి ఆ బానల్లో నింపావు.ప్రజలనుపీ డించి ధనం వసూలుచేశావు.కన్న బిడ్డలవలె చూసుకోవలసిన ప్రజలను ,ఎ న్నో కష్టాల పాలుచేశావు.ఆ నందం ధనం లో లేదు. అందరికీ ఆ నందం కలిగే పనులుచేస్తే ఆ ధనం వుపయోగం లోకివస్తే ఆ నందం లభిస్తుంది.ఆ ఏ డవబాన యే అత్యాశ !.మిగిలిన ఆ ఆ రూ అరిషడ్వర్గాలు. ఆ ఏడవదాన్ని నింపను ఎ వ్వరివల్లాకాదు. ఇప్పటికైనా తెలివొంది ప్రజా సంక్షేమం కోసం పాటుపడి తాతతండ్రులపేర్లు నిలుపు.ప్రజలనుసుఖపెట్టు.ఆ శాపాశం నాశనానికి దారితీస్తూదని తెల్సుకో….” అనిమాయమయ్యాడు సాధువు.

ఆ ఏడు బానలూ మాయమయ్యాయి.ప్రజాధనం అలాగేవుంది.తనతప్పు తెల్సుకున్న ధనవర్మ ఆ ధనాన్నంతా ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేసి ,ప్రజాహితకార్య క్రమాలన్నీ యధప్రకారం కొనసాగించి ,తనతప్పులన్నీ సరిదిద్దుకుని ,దురాశాపిశాచాని తరిమేసి,తల్లి తండ్రులనూ ప్రజలనూ

ఆ దరంతోచూసుకుంటూ, జనరంజకంగాపరిపాలించి,మంచిపలకుడిగాపేరుతెచ్చుకున్నాడు.ధనవర్మ గా కాక ధర్మ వర్మ గా పేరుపొందాడు.

నీతి:_ అత్యాశహానికరం.

About hyma1947

Retired headmistress, president awardee, kamci paramaguru sankaracarya goldmedalist.sathyasai devotee,balavikas guru.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )